సిరిసిల్ల టౌన్, ఆగస్టు 3: నవజాత శిశువులకు తల్లిపాలు శ్రీరామ రక్షలా నిలుస్తాయని రాజన్న సిరిసిల్ల అకాడమీ ఆఫ్ పిడియాట్రిషియన్స్ (ఆర్ఏపీ) అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్రావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు పేర్కొన్నారు. ఆర్ఏపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రం లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భం గా వారు విలేకరులతో మాట్లాడారు. తల్లి పాలలో పోషక విలువలు ఉంటాయని వివరించారు. ఆరు నెలల వయసు వరకు చిన్నారులకు తల్లిపాలను తప్పనిసరిగా అందించాల ని సూచించారు. తల్లిపాలు అమృతంతో సమానమని, చిన్నారులకు తల్లి పాలు అందించడంలో ఉన్న అపోహలను తొలిగించేందుకు ఆర్ఏపీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం లో డాక్టర్ ఎన్ శ్రీనివాస్, సాయికుమార్, ప్రేమ్కుమార్, శ్రావణ్రెడ్డి, అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.
బిడ్డకు శ్రీరామరక్ష
తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై, మాట్లాడారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని అంద రూ సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి వెంకటేశ్, సీహెచ్వో రమే శ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
సంపూర్ణ ఆరోగ్యం
తల్లిపాలతో పిల్లలకు సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఐసీడీఎస్ అంగన్వాడీ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ నెల 7వ తేదీన అన్ని గ్రామా ల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్లు జ్యోతి, అనసూర్య, వనతి, జ్యోతి తదితరులు ఉన్నారు.