పిట్లం : మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతంగా పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. దవాఖానలో ఆపరేషన్ థియేటర్, బాలింతల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిట్లం గ్రామపంచాయతీ కార్యాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీశ్రీనివాస్రెడ్డి జిల్లా కలెక్టర్ను సన్మానించారు. మండలస్థాయి అధికారులు గ్రామపంచాయతీ రికార్డులు పరిశీలించినప్పుడు రికార్డులలో నమోదు తప్పనిసరిగా చేయాలని సూచించారు.
అనంతరం తహసీల్ కార్యాలయానికి వెళ్లి ధరణి పోర్టల్ కొనసాగే విధానంపై వివరాలు అడిగి తెలుసుకుని రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తహసీల్దార్కు సూచించారు. పిట్లం ప్రభుత్వ దవాఖానలో రాత్రి సమయంలో విద్యుత్తు సమస్య నెలకొంటుందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలో నేటి వరకు 66 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగిందని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు.
ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ కవిత విజయ్, తాసీల్దార్ రామ్మోహన్రావ్, ఎంపీడీవో వెంకటేశ్వర్, ఎంపీవో బ్రహ్మం, వైధ్యాధికారులు శివకుమార్, రోహిత్కుమార్, టీఆర్ఎస్ నాయకులు విజయ్, బాబుసింగ్, ప్రతాప్రెడ్డి, జగదీశ్, నర్సాగౌడ్, కరీం తదితరులు పాల్గొన్నారు.