సిటీబ్యూరో,జూన్ 7 (నమస్తే తెలంగాణ): మైలార్దేవ్పల్లి నుంచి జల్పల్లి మున్సిపాలిటీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించిన పీ7 రహదారి పొడవునా.. ఏర్పాటు చేసిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో పరిమలిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించిన ఈ మొక్కలను ప్రయాణికులు వీడియో తీసి ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, జల్పల్లి మున్సిపాలిటీ కార్యాలయం రిట్వీట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు రోడ్డు పొడువునా ఉన్న పచ్చదనం పాత నగరానికి కొత్త అందం తెచ్చినట్లుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.