అహ్మదాబాద్: గుజరాత్లో కరోనా కేసుల తీవ్రత ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. పడకలు నిండిపోవడంతో కరోనా రోగులు తమ వంతు కోసం అంబులెన్స్లలో ఆసుపత్రి వద్ద వేచి ఉంటున్నారు. అడ్మిట్ అయ్యేలోపు చికిత్స అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. రాజ్కోట్లోని సివిల్ ఆసుపత్రి వద్ద గత కొన్ని రోజులుగా కరోనా రోగులున్న అంబులెన్స్లు భారీ సంఖ్యలో క్యూకడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.
మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగడంతో రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. దీంతో పడకల కొరత ఏర్పడింది. ఒక బెడ్పై ఇద్దరు ముగ్గురు రోగులను కూడా ఉంచుతున్నారు. అలాగే కరోనా రోగులతో అంబులెన్స్లు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నాయి.
కరోనా మరణించిన వారి సంఖ్య కూడా దేశంలో ఆందోళన రేపుతున్నది. పలు ఆసుపత్రుల మార్చురీలు మ`తదేహాలతో నిండిపోతున్నాయి. అంత్యక్రియలు నిర్వహించే శ్మశానవాటికల వద్ద కూడా బారీగా అంబులెన్స్లు, ఇతర వాహనాల క్యూలు ఉంటున్నాయి.