జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సింగరేణిలో వృక్ష రోపన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ సమీపంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి ఇంచార్జి జీఎం కవీంద్ర హాజరై పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
అలాగే ఏరియాలోని అన్ని గనుల ఆవరణలో ఆయా గనుల అధికారులు కార్మిక సంఘాల నేతలు, కార్మికులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్, భూపాలపల్లి ఎఫ్ఆర్వో నరేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.