సుబేదారి, మార్చి 12: పంచాయతీరాజ్ శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సాదుల ప్రసాద్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. హన్మకొండలోని నందిహిల్స్లో నివాసం ఉంటున్న ప్రసాద్ ములుగు జిల్లా తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ప్రసాద్ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు.