హన్మకొండ, ఏప్రిల్ 5: దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ పురస్కార్ కింద దేశంలోనే అత్యుత్తమ స్థానిక సంస్థలుగా రాష్ర్టానికి 12 పురస్కారాలు వచ్చినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును వరంగల్ అర్బన్ జిల్లా టీజీవో సంఘం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ జగన్మోహన్రావు మాట్లాడుతూ దేశంలోనే మొదటి సారి రాష్ట్రంలో అసలైన గ్రామ స్వరాజ్యస్థాపన సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతోందన్నారు. ఇదే తరహాలో పనితీరును కొనసాగిస్తూ, రాష్ర్టానికి మరింత పేరు తెచ్చేలా తమ వంతు కృషి చేస్తామని మంత్రికి తెలిపారు. కార్యక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు డాక్టర్ ప్రవీణ్కుమార్, ఈగ వెంకటేశ్వర్లు, రాజేశ్, ప్రభాకర్రెడ్డి, హసనొద్దీన్, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
అలాగే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును వరంగల్ అర్బన్ జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గ సభ్యులు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశించిన స్థాయిలో పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయసు పెంపులాంటి మొదలైన సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరి వేణుగోపాల్, ట్రెజరర్ పీ రాజేశ్, కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కోలా రాజేశ్కుమార్గౌడ్, నాయకులు శ్యాంసుందర్, కత్తి రమేశ్, రామూనాయక్, సారంగపాణి, సలీం, మోయిజ్, కుమార్, లక్ష్మీప్రసాద్, మల్లేశం, ఇంద్రారెడ్డి, రాజీవ్ పాల్గొన్నారు.
వీధి వ్యాపారులకు ‘స్వనిధి’ దరఖాస్తుకు గ్రేటర్లో ప్రత్యేక క్యాంపులు
వరంగల్, ఏప్రిల్ 5 : ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ నిధి నుంచి రూ.10వేల రుణం పొందిన వీధి వ్యాపారులు స్వనిధి సమృద్ధి పథకం ద్వారా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందేందుకు అర్హులని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వనిధిలో రుణం పొందిన వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి మాతృవందన, పీఎం శ్రమ యోగిమాన్ధన్, జన్ధన్ యోజన, నిర్మాణ రంగ కార్మికులకు బీమా పథకం, జననీ సురక్షా యోజన పథకాలు అమలు చేస్తారని పేర్కొన్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రేటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిసున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఏప్రిల్ 6, 7, 8, 9, 12, 15వ తేదీల్లో నిర్వహించే క్యాంపులకు హాజరు కావాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే వీధి వ్యాపారులు, వారి కుటుంబసభ్యులు ఆధార్కార్డు, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, పాన్కార్డు జిరాక్స్లు తీసుకురావాలని కమిషనర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?
మొసలి తలపైకి ఎక్కిన కోడి.. చివరికి ఏమైందో తెలుసా?.. వైరల్ వీడియో