వెల్దండ రిజర్వాయర్ నుంచి తరిగొప్పుల పెద్ద చెరువుకు..
బీడు భూములను ముద్దాడుతున్న గోదావరి జలాలు
తరిగొప్పుల, మే 18: మండు వేసవిలో గోదారమ్మ పరుగులు రైతుల ముఖాల్లో చిరునవ్వును తెప్పిస్తున్నది. దేవాదుల ప్రాజెక్టు అనుసంధానంగా మండలంలోని వెల్దండలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు మంగళవారం తరిగొప్పుల మండలంలోని బీడు భూములను ముద్దాడాయి. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాల రాకతో కరువు నేల పులకించి మండల రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. మండలకేంద్రంలోని పెద్ద చెరువును గోదావరి జలాలలో నింపితే 15 వందల ఎకరాలకు ప్రత్యేక్షంగా, మరో రెండు వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందుతుందన్నారు. మండే ఎండలకు పెద్దచెరువు ఎండిపోయి జీవాలకు నీరు లభించకపోవడంతో రైతులు సమస్యను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెల్దండ రిజర్వార్ నుంచి పెద్ద చెరువుకు నీరు విడుదల చేయించారన్నారు. గోదావరి జలాలు పదిరోజుల పాటు మండలంలోని బీడు భూములను తడుపుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుండడతో తెలంగాణలో రైతులు ఏటా రెండు పంటలు పండిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భూక్యా జుంలాల్నాయక్, టీఆర్ఎస్ మండల నాయకులు జొన్నగోని సుదర్శన్గౌడ్, ముద్దసాని వెంకట్రెడ్డి, అర్జుల సంపత్రెడ్డి, చెన్నూరి సంజీవ, జొన్నగోని కిష్టయ్యగౌడ్, దామెర లూక, ఎర్రవెల్లి పోశయ్య పాల్గొన్నారు.
ఇంటింటా మందుల పంపిణీ
స్టేషన్ఘన్పూర్ టౌన్, మే 18: కరోనా కట్టడికి మండలకేంద్రంలోని శివునిపల్లిలో మంగళవారం ఇంటింటా ఆశ వర్కర్లు అవగాహన కల్పించారు. అలాగే, ఇమ్యూనిటీ పవర్ పెంచే మెడిసిన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ గుర్రం మాధవి మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్నందున అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ హెల్త్ ఆర్గనైజేషన్ సిబ్బంది పాల్గొన్నారు.