ఉస్మానియా యూనివర్సిటీ/గౌతంనగర్/మల్కాజిగిరి/వినాయక్నగర్, జూలై 4: పట్టణాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తార్నాక డివిజన్ పరిధిలోని లాలాపేట, నాగార్జుననగర్ కాలనీలో ఆమె పర్యటిస్తూ ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. కలిసికట్టుగా ముందడుగు వేసి, చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని అన్ని వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి..మౌలిక వసతుల కల్పన, ఇతర సమస్యలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. జలమండలి ఆధ్వర్యంలో ప్రధాన రోడ్లపై ఉన్న మ్యాన్హోళ్ల ఎత్తు పనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. జీఎం రమణారెడ్డి, డీజీఎం డేవిడ్ రాజ్, మేనేజర్ నిఖిత ఆధ్వర్యంలో పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గౌతంనగర్ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాలుగో రోజూ కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్ ఆధ్వర్యంలో వీణాపానినగర్, బ్యాంక్ కాలనీలో అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం బ్యాంక్ కాలనీలో మొక్కలు నాటారు.
మౌలాలిలో…. మౌలాలి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ గున్నాల సునీత చంద్రశేఖర్యాదవ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి కృష్ణమూర్తి, వర్క్ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, జలమండలి అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా ప్రశాంత్నగర్లో కాలనీ అసోసియేషన్ సభ్యుల సహకారంతో పరిశుభ్రత, పారిశుద్ధ్యం పనులను ఈస్ట్ ఆనంద్బాగ్ కార్పొరేటర్ వై. ప్రేంకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో దుర్గాదాస్, సత్యమూ ర్తి, మల్లికార్జున్, బాబు సత్యనారాయణ పాల్గొన్నారు.
హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం అల్వాల్, వెంకటాపురం, మచ్చ బొల్లారం డివిజన్లల్లో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, ఏఎంహెచ్వో నిర్మలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అనిల్ కిశోర్, శివ, సంతోశ్, శ్రీనివాస్, సురేందర్రెడ్డి, శ్రావణ్, శ్రీనివాస్గౌడ్, శ్రీశైలం, రాములు, సైదులు, ప్రకాశ్ పాల్గొన్నారు.