ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

జనగామ క్రైం, డిసెంబర్ 29 : జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర అన్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆమె ఈఆర్వోల స్థాయిలో కొనసాగుతున్న ఎలక్టోరల్ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు, మార్పులు చేర్పుల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి దరఖాస్తును ఆమోదం లేదా తిరస్కరణకు ముందు అన్ని విధాలుగా విచారణ చేయాలన్నారు. జిల్లాలో ఫామ్-6 కింద 1,876, ఫామ్-7లో 5,640, ఫామ్-8లో 491, ఫామ్-8 ఏలో 28 దరఖాస్తులు వచ్చాయన్నారు. కొత్తగా ఓటరు నమోదు, మరణించిన, వలసలు వెళ్లిన వారి పేర్ల తొలగింపు తదితర మార్పులు చేర్పులు నిబంధనలకు మేరకు చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారి నుంచి ఏఈఆర్వో, ఈఆర్వో, డీఈవో స్థాయి వరకు అన్ని స్థాయిల్లో తనిఖీ చేయాలన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 857 పోలీంగ్ కేంద్రాలున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీఆర్వో మాలతి, ఆర్డీవో మధుమోహన్, తహసీల్దార్ రవీందర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఏతేషామ్ అలీ పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళను పొడిచి చంపిన చెయిన్ స్నాచర్.. వీడియో
- సలార్ నుండి క్రేజీ అప్డేట్.. ఆనందంలో ప్రభాస్ ఫ్యాన్స్
- అందమైన భార్య పక్కనుండగా.. డిప్రెషనా..? కోహ్లీకి ఇంజినీర్ చురకలు
- హిట్ సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని
- ప్రయాగ్రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్