అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1326 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజే కొవిడ్ వల్ల ఐదుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, చిత్తూర్, గుంటూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10710 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7244కు చేరింది.