సిద్దిపేట టౌన్, మార్చి 17 : మానవ అక్రమ రవాణా నిరోధానికి అధికారులు ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ప్రత్యేక చొరవ తీసుకొని పనిచేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా సూచించారు. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్పై బుధవారం డీఐజీ సుమతితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లాలో సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లతో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ నివారణకు 31 టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, వారందరూ వివిధ శాఖల అధికారులతో కలిసి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ సేఫ్టీ ఎస్వోపీపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. దర్బన్ యాప్ ద్వారా రాష్ట్రంలో 33 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. పిల్లల, మహిళల, పురుషుల అక్రమ రవాణా నిరోధానికి అన్ని శాఖల అధికారులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. కాన్ఫరెన్స్లో అడ్మిన్ ఏసీపీ శ్రీనివాసులు, డీఈవో రవికాంత్రావు, డీఆర్డీవో రవీందర్, జీసీడీవో మనీల, స్వార్డ్ ఎన్జీవో డైరెక్టర్ శివకుమారి, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాము, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ జిల్లా ఇన్చార్జి నర్సింహారావు, సైకాలజిస్టు ఉమాపతి, ప్రగతి ఎన్జీవో సెంటర్ ప్రెసిడెంట్ స్వరూపారాణి, సీడబ్ల్యూసీ చైర్మన్ రాజలింగం, సీసీఆర్బీ ఎస్సై ముకేద్పాషా, ఉమెన్ కౌన్సెలింగ్ సెంటర్ ఎస్సై భూలక్ష్మి, ఎస్సై విఠల్ అధికారులు పాల్గొన్నారు.