ఆయన మాటలు దిగజారుడుతనానికి నిదర్శనం
ప్రలోభాలకు లొంగే నాయకులు టీఆర్ఎస్లో లేరు
ఎల్లవేళలా పార్టీ వెంటే ఉంటాం
అభ్యర్థి ఎవరైనా అండగా ఉంటాం
ఈటలకు పార్టీ తడాఖా చూపిస్తాం
కేసీఆర్ నాయకత్వమే మాకు రక్ష
హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమళ్ల రాణి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక
హుజూరాబాద్, జూన్ 7 : మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడే తీరు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఎంపీపీ ఇరుమళ్ల రాణి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో కలిసి వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పెద్దలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు డబ్బులిచ్చి తనకు దూరం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించడం ఆయన మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. ప్రలోభాలకు లొంగే ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. తనకు కోట్ల రూపాయలు పలికే భూములున్నాయని, ఒక ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తాననడం ఆయనకు డబ్బు అహంకారం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము ఎల్లవేళలా టీఆర్ఎస్ వెంటే ఉంటామని, కేసీఆర్ నాయకత్వమే తమకు రక్ష అని చెప్పారు. డబ్బుల ఆశచూపి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను తన వైపు తిప్పుకొనేందకు ఈటల ప్రయత్నించడం ఆయన దారిద్య్ర పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి అండగా ఉంటామని ముక్త ఖంఠంతో చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఓడించడానికి ముందువరుసలో ఉంటామన్నారు. కేసీఆర్తో మాత్రమే అభివృద్ధి సాధ్యమని, ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని పేర్కొన్నారు. అన్నం పెట్టిన చేతిని నరుక్కోవడం అనే సామెత రాజేందర్ విషయంలో నిజమైందన్నారు. కేసీఆర్ తమ నాయకుడని, ఈటలకు టీఆర్ఎస్ తడాఖా చూపిస్తామన్నారు. ఇక్కడ మున్సిపల్ వైస్చైర్మన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సింగిల్విండోఅధ్యక్షుడు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.