న్యూఢిల్లీ: సాధారణంగా H3N8 రకం వైరస్వల్ల పక్షుల్లో బర్డ్ ఫ్లూ (Bird flu) వస్తుంది. ఈ వైరస్ కారణంగా కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అత్యంత అరుదుగా ఈ H3N8 రకం వైరస్వల్ల మానవులకు కూడా బర్డ్ ఫ్లూ సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం ముగ్గురిలో మాత్రమే బర్డ్ ఫ్లూ బయటపడింది. గత ఏడాది ఇద్దరికి బర్డ్ ఫ్లూ సోకినా కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్ ఫ్లూ బారినపడి మరణించింది.
ఈ మరణం ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ కారణంగా సంభవించిన తొలి మానవ మరణం (Human death)గా నమోదైంది. బర్డ్ ఫ్లూతో తొలి మానవ మరణం సంభవించిన దేశంగా చైనా నిలిచింది. చైనాలోని గ్వాంగ్డాంగ్కు చెందిన 56 ఏళ్ల మహిళ బర్డ్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం ముగ్గురిలో మాత్రమే బర్డ్ ఫ్లూ బయటపడగా.. ఈ ముగ్గురు కూడా చైనాకు చెందినవారే.
గత ఏడాది కూడా చైనాలోనే ఇద్దరు మనుషుల్లో బర్డ్ ఫ్లూ బయటపడింది. కానీ, ఆ ఇద్దరు వైరస్ను జయించి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ, ఈ ఏడాది ఒక మహిళ బర్డ్ ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. దాంతో బర్డ్ఫ్లూ వల్ల ప్రపంచంలోనే తొలి మానవ మరణం చైనాలో సంభవించిందని WHO తెలిపింది.