దుబాయ్: అత్యధిక ఉష్ణోగ్రతల్లో 2023దే రికార్డు అని ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూఎంవో వెల్లడించింది. పారిశ్రామికీకరణ జరగడానికి పూర్వం ఉష్ణోగ్రతల కన్నా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సగటున 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపింది.
2015నాటి పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం ఈ శతాబ్దాంతానికి ఉష్ణోగ్రత పెరుగుదల ఒక డిగ్రీలో పదో వంతుకు పరిమితం చేయవలసి ఉందని చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎల్నినో, పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వంటివాటి వల్ల వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోవచ్చునని తెలిపింది. ఐక్యరాజ్య సమితి వార్షిక వాతావరణ సదస్సులో ఈ నివేదికను విడుదల చేసింది.