ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని స్వాబి మహిళా యూనివర్సిటీ స్మార్ట్ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. ఖైబర్ ఫక్తునక్వాలో ఉన్న వర్సిటీ విద్యార్థులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ఫోన్లు, టచ్ స్క్రీన్ మొబైళ్లు లేదా ట్యాబెట్లను వర్సిటీలో నిషేధిస్తున్నానమని, వర్సిటీ పరిసరాల్లో వాటిని వాడరాదని, ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు వీసీ ఆదేశించారు. విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియా అప్లికేషన్లను వాడుతున్నారని, దీని వల్ల వాళ్ల విద్య, ప్రవర్తన, పర్ఫార్మెన్స్పై ప్రభావం పడుతున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆ విద్యార్థులకు 5వేలు జరిమానా విధించనున్నారు.ఖైబర్ ఫక్తునక్వా ప్రాంతంలోని యూనివర్సిటీలు మహిళ విద్యార్థులకు కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటాయి. డ్రెస్ కోడ్, హెయిర్ స్టయిల్ అంశాల్లోనూ అక్కడ అనేక ఆంక్షలు ఉన్నాయి.