బీజింగ్: చైనాలో కరోనా విజృంభిస్తున్నది. ఆ దేశ ప్రజల ఆందోళనల నేపథ్యంలో కరోనా ఆంక్షలను అక్కడి ప్రభుత్వం సడలించింది. దీంతో చైనాలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్పై చర్యలు చేపట్టాలని సూచించారు. చైనా ఆరోగ్య వ్యవస్థల పరిరక్షణకు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామని చెప్పారు.
కాగా, చైనాలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఆ దేశం నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ దీనిపై కూడా స్పందించారు. చైనాలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదు గురించి సరైన సమాచారం లేదని అన్నారు. అయినప్పటికీ పలు దేశాలు ముందు జాగ్రత్తగా పలు చర్యలు చేపడుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్ల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. కరోనా గురించి అర్థం చేసుకోవడంలో ఏర్పడే గ్యాప్ వల్ల భవిష్యత్తులో సంభవించే మహమ్మారిలను అర్థం చేసుకోవడం, ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందన్నారు.
We remain concerned about the evolving situation and we continue encouraging #China to track the #COVID19 virus and vaccinate the highest risk people. We continue to offer our support for clinical care and protecting its health system.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 29, 2022