వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చెప్పేందుకు శ్వేతసౌధం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కారీన్ జీన్ పెర్రీ(White House Press Secretary Karine Jean-Pierre) మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ బైడెన్(President Biden) అని పిలవడానికి బదులుగా ప్రెసిడెంట్ ఒబామా(President Obama) అని పలికారు. ఆ ప్రెస్మీట్ టీవీల్లో లైవ్ అవుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న రిపోర్టర్లు లైట్గా అరిచారు.
Karine Jean-Pierre says “President Obama” instead of Biden.
Quiet part out loud.
— Benny Johnson (@bennyjohnson) February 23, 2023
తన తప్పును తెలుసుకున్న పెర్రీ.. క్షమాపణలు కోరారు. ఒబామా కాదు బైడెన్ అని పేర్కొన్నారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బంగాను ప్రెసిడెంట్ ఒబామా ప్రతిపాదించినట్లు ఆమె తన స్టేట్మెంట్లో చదివారు. ఆ వ్యాఖ్యలను వెంటనే సవరించుకుని మళ్లీ బైడెన్ అని పలికారు. మనం వెనక్కి వెళ్తున్నాం.. ముందుకు వెళ్లడం లేదు.. కానీ మనం ముందుకు వెళ్లాలని ఆమె అన్నారు. తప్పుగా పేరు పలికినందుకు క్షమాపణలు కోరారు.
ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టెర్లు ఎన్నుకుంటే వరల్డ్ బ్యాంకు మొట్టమొదటి ఇండియన్ – అమెరికన్, సిక్కు – అమెరికన్గా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ కీలక సమయంలో ఈ బాధ్యత చేపట్టడానికి, ప్రపంచ బ్యాంకును నడిపించడానికి అజయ్ అన్ని విధాలుగా సమర్థుడని బైడెన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పెట్టుబడులు కల్పించిన ప్రపంచస్థాయి సంస్థలను నిర్మించడంలో, నడిపించడంలో మూడు దశాబ్దాలుగా అజయ్ బంగా విజయవంతంగా పని చేస్తున్నారని జో బైడెన్ కొనియాడారు.
అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణె కంటోన్మెంట్ ప్రాంతంలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అహ్మదాబాద్లోని ఐఐఎంలో పీజీ చేశారు. మాస్టర్కార్డు సహా అనేక అంతర్జాతీయ సంస్థల్లో పని చేశారు. అమెరికాలో స్థిరపడిన అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్కు వైస్ చైర్మన్గా ఉన్నారు.