ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) జైలులో మరణించినట్లు పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు చెందిన ముగ్గురు సోదరీమణులు జైలు వద్దకు వెళ్లి ధర్నా చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు తమపై దాడి చేసినట్లు ఇమ్రాన్ చెల్లెల్లు పేర్కొన్నారు. నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ .. ముగ్గురూ జైలు ముందు జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులతో పాటు తమపై కూడా పోలీసులు చేయి చేసుకున్నట్లు ఆరోపించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ప్రస్తుతం ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ను కలుసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆ ముగ్గురు డిమాండ్ ఛేశారు. ఇమ్రాన్ను కలిసి మూడు వారాలు అవుతోందని వాళ్లు ఫిర్యాదు చేశారు.
#BREAKING: Midnight Protest by Imran Khan’s sister and PTI supporters outside Adiala Jail. Imran Khan hasn’t been allowed to meet any family member since last more than three weeks. Anger raging across Pakistan against Asim Munir and Pakistani establishment in Rawalpindi. pic.twitter.com/sH0ujS07wv
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 25, 2025