ఇస్లామాబాద్: ప్రధాని పదవి కోల్పోయిన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పాకిస్థాన్ తెహ్రీక్ పార్టీకి చెందిన సభ్యులు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఇమ్రాన్.. ప్రధాని పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన పీటీఐ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము అసెంబ్లీలో కూర్చోవద్దు అని నిర్ణయించామని, దేశాన్ని దోచుకున్నవారితో కలిసి పనిచేయలేమని ఇమ్రాన్ అన్నారు.