మాస్కో : రష్యా సైన్యాధికారులపై వాగ్నర్ దళం తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రకటన చేశారు. అంతర్గత దేశ ద్రోహుల నుంచి దేశాన్ని రక్షించుకుంటామని ఆయన అన్నారు. సోదరుడే సోదరున్ని మోసం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దేశ ద్రోహానికి పాల్పడుతూ సైనిక చర్యకు దిగుతున్న వ్యక్తుల్ని శిక్షిస్తామని పుతిన్ అన్నారు. శనివారం జాతిని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో వాగ్నర్ దళాలకు హెచ్చరిక చేశారు.
సైనిక తిరుగుబాటుకు ఉసిగొల్పిన వారిని అడ్డుకుంటామన్నారు. ఇలాంటి సమయంలో ఐక్యత కావాలని, బాధ్యత అవసరమన్నారు. కావాలని దేశద్రోహ పంథాలో నడిచేవారిని, ఉగ్రదాడులకు పాల్పడుతున్నవారిని తప్పకుండా శిక్షిస్తామని పుతిన్ తెలిపారు. అంతర్గత కుమ్ములాట చాలా ప్రమాదకరమైందని, దేశానికి సమస్యగా మారుతుందని, రష్యా ప్రజలకు ఇది ఎదురుదెబ్బ అవుతుందని, స్వదేశాన్ని కాపాడేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని, అటువంటి దేశద్రోహాలను కఠినంగా శిక్షిస్తామని పుతిన్ హెచ్చరిక చేశారు.
ఉక్రెయిన్తో యుద్ధం సాగుతున్న దశలో వాగ్నర్ తిరుగుబాటు వెన్నుపోటే అవుతుందని పుతిన్ అన్నారు. మరోవైపు రోస్టోవ్, వోరోజిన్ నగరాల్లో వాగ్నర్ దళాలు ప్రభుత్వ బిల్డింగ్లను స్వాధీనం చేసుకున్నాయి. రక్షణ మంత్రి షోయుగును