వాషింగ్టన్: భారతీయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న హెచ్-1బీ వీసా జారీ విధానాన్ని సమూలంగా మార్చుతానని అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి చెప్పారు.
తాను అధికారంలోకి వస్తే లాటరీ విధానానికి స్వస్తి చెప్పి, దాని స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని ప్రవేశపెడుతానని పేర్కొన్నారు. ప్రస్తుత విధానం కంపెనీలకే ప్రయోజకరంగా ఉన్నదని చెప్పారు.