భువనేశ్వర్, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన జగన్నాథ రథయాత్రకు కొన్ని లక్షలాదిమంది హాజరవుతుంటారు. ప్రతి ఏటా జులై మాసంలో పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగుతాయి. కరోనా కారణంగా గతేడాది భక్తులను పరిమిత సంఖ్య లోనే అనుమతించారు. ఈసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి భక్తులు లేకుండానే జగన్నాథుడి రథయాత్ర కొనసాగనుంది.
ఈఏడాది జగన్నాథుడి రథయాత్ర జులై 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 20వ తేదీ ఈ రథయాత్ర ముగుస్తుంది. యాత్ర మొదటి రోజున జగన్నాథుడు ప్రసిద్ధ గుండిచ మాతా ఆలయాన్ని సందర్శిస్తాడు. అయితే ఈ ఏడాది కూడా జగన్నాథుడి రథయాత్ర బోసిపోయేలా కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒడిశా సర్కారు రథయాత్రకు భక్తులెవరినీ అనుమతించడం లేదని ప్రకటించేసింది. కరోనా సెకండ్ వేవ్లో పూరి జగన్నాథ్ యాత్రను భక్తులు లేకుండా నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిద్ నియమ నిబంధనలను పాటిస్తూ.. రథయాత్రను నిర్వహిస్తామని పరిమిత స్థాయిలో భక్తులు, పండితులు ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటారని తెలిపింది.