వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా (USA) వచ్చే నెలలో ప్రజాస్వామ్యంపై (democracy) శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో వర్చువల్గా (virtual summit) జరగనున్న ఈ సదస్సుకు భారత్ సహా 110 మిత్ర దేశాలను అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. అయితే తమ ప్రత్యర్థి అయిన చైనాను దూరం పెట్టారు. కాగా, చైనా ఆక్రమించుకోవాలని చూస్తున్న తవైన్ను ఈ వర్చువల్ భేటీకి పిలిచారు.
అధికారిక వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశానికి నాటో సభ్యదేశమైన టర్కీని, రష్యా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకను దూరంపెట్టారు. అదేవిధంగా మధ్యప్రాశ్చ్యంలోని ఇరాక్, ఇజ్రాయిల్కు మాత్రమే ఆహ్వానం లభించింది. సంప్రదాయ భాగస్వాములైన ఈజిప్ట్, సౌదీఅరేబియా, జోర్డాన్, ఖతార్, యూఏఈలకు ఆహ్వానితుల జాబితాలో చోటు లభించలేదు.
US President Biden Invites 110 Countries To Virtual Democracy Summit