వాషింగ్టన్: క్వాడ్ ఫెలోషిప్కు నాలుగు సభ్య దేశాల నుంచి అమెరికా 100 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వీరిలో భారత్ నుంచి 25 మంది ఉన్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నుంచి క్వాడ్ ఫెలోస్ మొదటి బృందానికి ఎంపికైన విద్యార్థులకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేకే సులివాన్ శుభాకాంక్షలు తెలిపారు.
క్వాడ్ ఫెలోషిప్ను తరువాతి తరం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు భాగస్వామ్య దేశాలు 2021 సెప్టెంబర్లో ప్రకటించాయి.