న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నెల 28న భారత్ను సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో ఆయన సమావేశమవుతారు. అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తన బలగాలను అమెరికా వెనక్కి రప్పించడంతో తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. దాడులకు పాల్పడి సుమారు 90 శాతం సరిహద్దు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి తాలిబన్ల పాలన రావచ్చని అంతా భావిస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వానికే తమ మద్దతు అని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తొలిసారి భారత్కు వస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో ఇరు దేశాలకు సంబంధించిన అంశాలతోపాటు ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిస్థితిపై చర్చించవచ్చని తెలుస్తున్నది.