హైదరాబాద్ : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశానికి చేరుకున్నారు. శనివారం కోల్కతాలోని సెయింట్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయమైన మదర్ హౌస్ను సందర్శించడంతో భారతదేశంలో తన తొలి నాలుగు రోజుల అధికార పర్యటనను ప్రారంభించారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో రూబియోకు ఘన స్వాగతం లభించింది. ఆయన అక్కడ సుమారు గంటసేపు గడిపారు. మదర్ హౌస్ను సందర్శించిన అనంతరం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్వహిస్తున్న నిర్మల శిశు భవన్ అనే అనాథాశ్రమాన్ని సందర్శించారు. నగరంలోని విక్టోరియా మెమోరియల్ను సందర్శించారు.
మే 23 నుంచి మే 26 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సహకారం, క్వాడ్ (QUAD) సమావేశాలపై భారత నాయకులతో చర్చలు జరపనున్నారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని గతంలోనే ఆయన స్పష్టం చేశారు.