న్యూఢిల్లీ: ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కొ రూబియో అన్నారు. అమెరికాలో భారత సంతతిపై జాతి విద్వేష వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన స్పందించారు. ప్రతి దేశంలో మూర్ఖులుంటారు.
ఇలాంటి తెలివి తక్కువ వ్యాఖ్యలను వాళ్లు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారని రూబియో వెల్లడించారు.