US | వాషింగ్టన్ : అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దేనని అమెరికా తేల్చి చెప్పింది. భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా అధ్యక్ష కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు ఈమేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
చైనా వాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంట ఆ దేశం ఏకపక్షంగా చేస్తున్న ఆక్రమణ యత్నాలను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం జరిపిన పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.