వాషింగ్టన్, ఏప్రిల్ 22 : జీ-20 సదస్సు సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు.
ఈ పర్యటనపై అధ్యక్షుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా ఉన్నతాధికారి డోనాల్డ్ లూ వెల్లడించారు. భారత్-అమెరికా సంబంధాల్లో 2023 చాలా ముఖ్యమైనదిగా బైడెన్ భావిస్తున్నారని పేర్కొన్నారు.