Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముందుగా ఇరాన్ వెల్లడించింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అంగీకరించారు. ఇరాన్ తమ అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిందన్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే, అమెరికా ప్రభుత్వం కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
‘‘హార్ముజ్ జలసంధిపై వెళ్తుండగా ఆధునిక, ప్రభావవంతమైన అపాచీ హెలికాప్టర్లను గత రాత్రి ఇరాన్ కూల్చివేసిందని అమెరికా మిలిటరీ విభాగం తెలిపింది. ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు ఉండగా, వారు గాయాలులేకుండా, సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడిపై అమెరికా ప్రతిదాడికి స్పందించాలి” అని ట్రంప్ అన్నారు. ఇరాన్పై దాడి తప్పదంటూ హెచ్చరించారు. అమెరికా ఆర్మీకి చెందిన ఏహెచ్64 అనే విమానం సోమవారం రాత్రి హార్ముజ్ జలసంధివైపు వెళ్తుండగా, ఒమన్ తీరంలో ఇరాన్ కూల్చివేసింది. ఈ హెలికాప్టర్ నడుపుతున్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. వారిని రెండు గంటల తర్వాత అమెరికా దళాలు రక్షించాయి. అమెరికాకు చెందిన యూఎస్ నావల్ సెంట్రల్ కమాండ్ విభాగం పైలట్లను రక్షించింది.
“I have just been informed by our Great Military that last night the Iranians shot down one of our highly sophisticated Apache Helicopters while patrolling over the Strait of Hormuz. There were two pilots involved, both are safe and uninjured. Nevertheless, the United States… pic.twitter.com/yMGXqG89ax
— The White House (@WhiteHouse) June 9, 2026
అయితే, హెలికాప్టర్పై ఇరాన్ ఎలా దాడి చేసింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే, ఇరాన్ చర్య రెండు దేశాల మధ్య చర్చలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఒకవైపు ట్రంప్.. ఇరాన్పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు. అలాంటిది, ఇరాన్ మాత్రం అమెరికా హెలికాప్టర్ను కూల్చేసింది. మరోవైపు ఇజ్రాయెల్.. లెబనాన్పై దాడులు చేస్తోంది. త్వరలోనే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి వస్తాయని, ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు.