న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) 2025లో క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల ద్వారా సుమారు 104 కోట్ల డాలర్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్రంప్ ఆర్థిక లావాదేవీలకు చెందిన రిపోర్టును రిలీజ్ చేశారు. అయితే ఆయన సంపద అమాంతం పెరిగినట్లు ఆ నివేదికలో తెలిపారు. ట్రంప్తో పాటు ఆయన కుమారులకు చెందిన క్రిప్టో వ్యాపారంలో భారీగా ఆదాయం వచ్చినట్లు తెలిసింది. క్రిప్టో పెట్టుబడుల ఆదాయం గురించి అమెరికా ప్రభుత్వాన్ని ట్రంప్ వెల్లడించారు.
సాధారణంగా రియల్ ఎస్టేట్, గోల్ఫ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ట్రంప్ ఫ్యామిలీకి.. గత ఏడాది క్రిప్టో వ్యాపారం ద్వారా దాదాపు 104 కోట్ల డాలర్లకుపైగా ఆదాయం వచ్చినట్లు తెలిసింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కంపెనీ ద్వారా ట్రంప్ సుమారు 800 మిలియన్ల డాలర్లు ఆర్జించారు. ఆ కంపెనీలో ఆయన కుమారులు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారు. క్రిప్టో టోకెన్ సేల్స్ ద్వారా 520 మిలియన్ల డాలర్లు, ఇక వరల్డ్ లిబర్టీ బిజినెస్ లో క్రిప్టో అమ్మకాల ద్వారా మరో 250 మిలియన్ల డాలర్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్రంప్ మీమి కాయిన్ల అమ్మకం ద్వారా అదనంగా 635 మిలియన్ల డాలర్లు ఆర్జించారు.
రెండో సారి దేశాధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ క్రిప్టో ఆస్తులు ఒక్కసారిగా జంప్ చేశాయి. 2024లో ట్రంప్ టోకెన్ సేల్స్ ద్వారా కేవలం 57.35 మిలియన్ల డాలర్లు మాత్రమే ఆర్జించారు.అయితే తాజా గణాంకాల ప్రకారం ట్రంప్ క్రిప్టో ఆస్తులు సుమారు తొమ్మిది రెట్లు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.