వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో రష్యా భారీ సంఖ్యలో సైనికులను (Russian troops) కోల్పోయిందని, పెద్ద సంఖ్యలో సైనికులు గాయపడ్డారని అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన 20 రోజుల్లోనే ఏడు వేల మందికిపైగా రష్యన్ సైనికులు చనిపోయారని పేర్కొన్నది. ఇది అఫ్ఘానిస్థాన్, ఇరాక్లో 20 ఏండ్ల పాటు చేసిన పోరాటంలో చనిపోయిన అమెరికా సైన్యం కంటే చాలా ఎక్కువని వ్యాఖ్యానించింది.
సుమారు లక్షా 50 వేల మందికిపైగా రష్యా బలగాలు ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నాయని, ఇందులో 14 వేల నుంచి 21 వేల మంది సైనికులు గాయపడ్డారని చెప్పింది. పోరులో పది శాతానికి మించి సైనికులు గాయపడినా, మృతిచెందినా అది విఫలమైనట్లేనని పేర్కొన్నది.
At least 7,000 Russian soldiers killed in Ukraine and more than 14,000 injured, according to U.S. estimates – NYT
— BNO News (@BNONews) March 17, 2022
కాగా, రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఇవో జైమాలో జరిగిన 36 రోజుల యుద్ధంలో 7 వేల మంది చనిపోయారని తెలిపింది. కానీ ఉక్రెయిన్పై దాడిలో 20 రోజుల్లోనే ఏడు వేల మందిని రష్యా కోల్పోయిందని చెప్పింది.