వాషింగ్టన్, అక్టోబర్ 31: హిరోషిమాపై 1945లో ప్రయోగించిన దాని కంటే 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబు తయారు చేస్తామని అమెరికా ప్రకటించింది. 2030 నాటికి తమ అణ్వాయుధాల సంఖ్యను వెయ్యికి పైగా పెంచుతామని చైనా ప్రకటించిన అనంతరం పెంటగాన్ ఈ ప్రకటన చేసింది.
జాతీయ అణ్వస్త్ర భద్రతా యంత్రా ంగం ‘బీ61-13’ అనే సూపర్ పవర్ఫుల్ అణుబాంబును తయారు చేస్తుందని తెలిపింది. మారుతున్న ప్రపంచంలో దేశ భద్రత డిమాండ్ దృష్ట్యా ఈ బాంబు తయారు చేస్తున్నట్టు చెప్పింది. ఈ బాంబ్ తయారీకి 692 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు.