జెనీవా: అమెరికా-ఇరాన్ మధ్య యుద్దాన్ని ఆపడానికి స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో బ్రెజిల్ పాత్రికేయుడొకరు సంచలన విషయాన్ని వెల్లడించారు.
చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ మిలిటరీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ సహా మొత్తం పాక్ ప్రతినిధి బృందాన్ని హతమార్చడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రణాళిక వేసిందని బ్రెజిల్ పరిశోధక పాత్రికేయుడు, భౌగోళిక వ్యూహరచన నిపుణుడైన పెపె ఎస్కోబార్ ఆరోపించారు. మొస్సాద్ దాడి గురించి తెలిసిన పాక్ మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్కు నేరుగా హెచ్చరిక జారీ చేసిందన్నారు.