వాషింగ్టన్: ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు జరిగిన కుట్రను అమెరికా అధికారులు భగ్నం చేశారు. దీని వెనుక భారత ప్రభుత్వం ప్రమేయం ఉన్నదన్న అనుమానాలపై భారత ప్రభుత్వంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తా కథనం పేర్కొన్నది.
పన్నూ హత్యకు కుట్ర జరిగిందని అమెరికాలోని అనధికారిక వర్గాలను ఉటంకిస్తూ బుధవారం ఈ వార్తా కథనం వెలువడింది. దీనిపై భారత విదేశాంగ శాఖ గానీ, ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గానీ స్పందించలేదు.