Israel-Hamas War | అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా (Hostages) చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలతోపాటు ఇద్దరు అమెరికన్లను మానవతా కోణంలో హమాస్ ఇటీవలే విడుదల చేసింది. మరో 50 మంది బందీలు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ ప్రకటించింది.
అయితే, మిగతా వారి జాడ కోసం ఇజ్రాయెల్ సహా అగ్రరాజ్యం అమెరికా తీవ్ర గాలింపు చేపడుతోంది. హమాస్ అపహరించిన బందీల జాడ కోసం అమెరికా డ్రోన్లను (US Drones) రంగంలోకి దింపింది. అమెరికా రంగంలోకి దింపిన నిఘా డ్రోన్లు గాజా (Gaza) గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. బందీలను దాచిన ప్రదేశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ను సేకరిస్తున్నాయి. అయితే, వారం క్రితం నుంచే ఇవి బందీల కోసం వెతుకులాట మొదలెట్టాయని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
మరోవైపు గాజా సిటీని ఇజ్రాయిల్(Israel) మిలిటరీ చుట్టుముట్టేసింది. గాజా పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న హమాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన నేటికి 28 రోజులైంది. గాజాలో ఇప్పటి వరకు సుమారుగా 10 వేల మంది మరణించారు. దాంట్లో 3760 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Jaishankar | ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన దాడులు ఉగ్రవాద చర్యే : జైశంకర్
Karwa Chauth | కర్వాచౌత్ రోజు.. పుట్టింటికెళ్లిన భార్య తిరిగిరాలేదని బలవన్మరణానికి పాల్పడిన భర్త