కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించిన 27 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ సోమవారం తెలిపింది. బైడెన్ ప్రభుత్వం గత ఆగస్టులో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చట్టం చేసింది.
ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి అన్నె స్టెఫానెక్ మాట్లాడుతూ.. “తొలగింపబడిన ఉద్యోగులు వ్యాక్సిన్ ఎందుకు నిరాకరించారో కారణాలు తెలుపమని అడిగినప్పుడు.. వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వారెవరికీ వాక్సిన్ నుంచి మినహాయింపు లభించలేదు” అని అన్నారు. ఎయిర్ఫోర్స్లో దాదాపు 97 శాతం ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకున్నారని స్టెఫానెక్ తెలిపారు.
అమెరికన్ భద్రతా దళాల(మిలిటరీ, నేవి, ఎయిర్ ఫోర్స్)లో ఇప్పటివరకు కరోనా కారణంగా 79 మంది చనిపోయారని సమాచారం.