ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా దాడులను పెంచుతోంది. కీవ్, ఖార్కీవ్ ప్రాంతాల్లో బాంబు దాడులను తీవ్రతరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, టీవీ టవర్, పోలీస్ బిల్డింగ్… ఇలా పలు ప్రాంతాలపై రష్యా సేనలు బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ దాడులకు దీటుగా బదులిచ్చేందుకు ఉక్రెయిన్ శతధా ప్రయత్నిస్తూనే వుంది. అయినా.. వాటి బలం సరిపోవడం లేదేమో. దీంతో స్థానికులే ఏకంగా రంగంలోకి దిగారు. రష్యాను ప్రతిఘటించడానికి పెట్రో బాంబులను వాడాలని నిర్ణయించుకున్నారు.
ఈ పెట్రో బాంబుల ద్వారా రష్యాను ఎదుర్కొంటామని, కీవ్ ప్రాంతాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కీవ్ ప్రాంతానికి రక్షణగా తాము ఉంటామని, పెట్రో బాంబుల వాడుతూ… రష్యాకు బదులిస్తామని పేర్కొంటున్నారు. తాము యుద్ధానికి ఏమాత్రం భయపడటం లేదని, తమ మాతృభూమి కోసం తాము పోరుడుతున్నామని అంటున్నారు. తామేమీ రష్యాకు భయపడటం లేదు. మేము కూడా మంచి పోరాట యోధులమే. ఎలాంటి ఆయుధాలు కూడా లేకుండా రష్యా సేనలతో పోరాటం చేయగలం అని పేర్కొంటున్నారు.