కీవ్ : ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పలు నగరాలు, పట్టణాలు లక్ష్యంగా రష్యా దాడులను ఉధృతం చేసింది. జనావాసాలపైనా కాల్పులతో విరుచుకుపడుతుండటంతో పౌరులు భయాందోళనలకు గురవుతున్నారు.
రష్యా దాడిని తిప్పికొట్టేందుకు పలువురు మాజీ సైనికులు, పౌరులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరుతుండగా తాజాగా 98 ఏండ్ల ఉక్రెయిన్ మహిళ సైన్యంలో చేరేందుకు ఆసక్తి కనబరిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో చురుకుగా పాల్గొన్న ఒలా టెడ్కిల్బోవ రష్యాతో పోరుకు సై అందని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
ఉక్రెయిన్పై రష్యా దమనకాండకు పుతిన్ ఆదేశాలు జారీ చేసిన అనంతరం ఓలా మాతృభూమిని కాపాడుకునేందుకు సైన్యంలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వయోభారం కారణంగా ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చారు. త్వరలోనే ఆమె కీవ్లో విజయోత్సవ వేడుకలు చేసుకుంటారని ఆశిస్తున్నామని పోస్ట్కు క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్కు 3800కు పైగా లైక్లు, పెద్దసంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి.