ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో భారతదేశం.. రష్యా వైపు మొగ్గు చూపుతోందంటూ భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ సైనికులు హింసిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు.. భారతీయ విద్యార్థులను హింసిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి.
కొందరు విద్యార్థులు మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సైనికులు తమను సరిహద్దు దాటనివ్వడం లేదని తెలిపారు. రష్యాకు భారత్ మద్దతిచ్చిందని చెప్తున్న సైనికులు.. తమను బోర్డర్ దాటనివ్వడం లేదని వాళ్లు వాపోయారు. ఇలాంటి ఒక వీడియోను కాంగ్రెస్ కీలకనేత రాముల్ గాంధీ కూడా షేర్ చేశారు. ఈ వీడియోలు చూసిన సదరు విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందని రాహుల్ ప్రశ్నించారు.
కాగా, ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి మర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులు.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రోమేనియా, హంగేరీ, స్లొవేకియాలకు వెళ్లారని తెలిపారు. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని ఆయన అన్నారు.
My heart goes out to the Indian students suffering such violence and their family watching these videos. No parent should go through this.
GOI must urgently share the detailed evacuation plan with those stranded as well as their families.
We can’t abandon our own people. pic.twitter.com/MVzOPWIm8D
— Rahul Gandhi (@RahulGandhi) February 28, 2022
A Ukrainian security officer kicking the already distressed Indian students. Wonder what crime have they committed to deserve such a treatment?pic.twitter.com/5PIpHMOECu
— Jas Oberoi | ਜੱਸ ਓਬਰੌਏ (@iJasOberoi) February 27, 2022