అన్నంత పనీ చేయడానికి బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ సిద్ధపడిపోయారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా గనక కఠిన నిర్ణయాలు తీసుకుంటే… తమ దేశంలోని రష్యా సంస్థలపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే… మంగళవారం బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. రష్యాకు చెందిన కీలకమైన ఐదు బ్యాంకులపై ఆంక్షలు విధిస్తామని అధికారికంగా ప్రకటించారు. రోషియా బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రామ్స్వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి.
అంతేకాకుండా రష్యాకు చెందిన ముగ్గురు అత్యంత ధనవంతులపై కూడా ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. ఇందు కోసం పార్లమెంట్ నుంచి ప్రత్యేక అధికారాలను కూడా పొందామని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పలేమని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా పరిగణిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కీలక ఘట్టం ముగిసిన తర్వాతే బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.