పాత ఇల్లు రినొవేట్ చేయాలని ఆ జంట తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని మార్చేసింది. వంట గదిలో తవ్వుతుండగా వాళ్లకు ఒక పెట్టె దొరికింది. దానిలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి 264 బంగారు నాణేలు దొరికాయి. వాటి ధర ఎలా లేదనుకున్నా రూ.2.3 కోట్లు పలుకుతుందని అంచనా. యూకేకు చెందిన ఈ జంట అదే ఇంట్లో దాదాపు పదేళ్లుగా ఉంటోంది.
తాజాగా ఇల్లు రినొవేట్ చేద్దామని అనుకుంది. ఈ క్రమంలో వంట గది ఫ్లోర్ బోర్డ్ మార్చేందుకు తవ్వుతుండగా ఒక పెట్టె కనిపించింది. ఆ బాక్సు ఏంటా? అని తెరిచి చూస్తే దానిలో పాతకాలం నాటి బంగారు నాణేలు కనిపించాయి. ఇవి 18వ శతాబ్దం నాటివని తెలిసిన సదరు జంట వాటిని వేలంపాటలో అమ్మాలని నిర్ణయించుకుంది. ఎల్లర్బీ గ్రామంలోని ఈ ఇంట్లో దొరికిన ఈ నాణేలు.. బ్రిటన్ను జేమ్స్-I, చార్లెస్-I పరిపాలించిన సమయం నాటివని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ నాణేలన్నీ కూడా 1610 నుంచి 1727 మధ్య కాలం నాటివని ఆ జంట గుర్తించింది. ఆ కాలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబం ఈ సొమ్మును దాచుకొని ఉంటుందని పరిశోధకుల భావన. వీటిపి 2.5 లక్షల పౌండ్లు (సుమారు రూ.2.3 కోట్లు)కు అమ్మేందుకు ఈ జంట సిద్ధమైంది.