Train cancellation | లండన్ : బ్రిటన్లో విచిత్ర ఘటన జరిగింది. శనివారం ఉదయం దక్షిణ ఇంగ్లండ్లోని రీడింగ్ నుంచి గాట్విక్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన ఓ రైలు గోమ్షాల్ వద్దకు చేరుకోగానే ఓ బోగీలోకి రెండు ఉడుతలు ప్రవేశించాయి. దీంతో ఆ బోగీలోని ప్రయాణికులు హడలెత్తి మరో బోగీలోకి పరుగు లు తీశారు. ఆ రైలు సర్రీలోని రెడ్హిల్ స్టేషన్కు చేరుకోగానే సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఉడుతలను బయటికి తరిమేందుకు యత్నించారు. కానీ, వాటి లో ఓ ఉడుత రైలు దిగకుండా మొండికేయడంతో గమ్యస్థానానికి చేరకముందే ఆ రైలు సర్వీసును రద్దు చేయాల్సి వచ్చినట్టు గ్రేట్ వెస్ట్రన్ రైల్వే అధికారులు వెల్లడించారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనిషి మెదడులో చిప్ పెట్టిన ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్’.. ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతున్నది. పుట్టుకతో చూపులేని వారికి, మధ్యలో చూపు కోల్పోయిన వారిలో చూపు కల్పించే ‘బ్లైండ్సైట్’ డివైజ్ను అమర్చేందుకు అమెరికాకు చెందిన యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఈ సంస్థకు అనుమతి ఇచ్చింది. రెండు కండ్లు పోయినా, ఆప్టిక్ నరం దెబ్బతిన్నా.. ఈ పరికరంతో లోకాన్ని చూడొచ్చని కంపెనీ వెల్లడించింది.
ఎలాన్మస్క్ ప్రకారం.. పుట్టుకతో అంధులైన వారికి కూడా ఈ పరికరం ఉపయుక్తంగా పనిచేస్తుంది. దీన్ని వాడిన మొదట్లో దృష్టి సామర్థ్యం తక్కువగా ఉంటుంది.. కాలక్రమేణా సహజమైన కంటిచూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుంది. అతినీలలోహిత కిరణాలను కూడా ఎలాంటి ప్రభావం లేకుండా భేషుగ్గా చూడొచ్చు. మెదడులోని విజువల్ కార్టెక్స్కు ఒక మైక్రో ఎలక్ట్రోడ్ను అమర్చి ప్రపంచాన్ని వీక్షించొచ్చు. దానికోసం ఒక కెమెరాను కూడా అమర్చుతారు. దానితో న్యూరాన్లు యాక్టివేట్ అయ్యి చూపును కలుగజేస్తారు. మనుషులపై ప్రయోగాలకు పట్టే సమయంపై మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.