వాషింగ్టన్, మార్చి 1: అమెరికా ఎగుమతి మండలిలో ఇద్దరు భారతీయ అమెరికన్లను చోటు దక్కే అవకాశం కనిపిస్తున్నది. ఈ మండలి అంతర్జాతీయ వ్యాపారంలో జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది. ఈ మండలిలో నియమించాలనుకుంటున్న సభ్యుల పేర్లను మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇందులో ప్రముఖ కార్పొరేట్లు పునిత్ రెంజెన్, రాజేశ్ సుబ్రమణియంకు చోటు దక్కింది. రెంజెన్ డెలాయిట్ కన్సల్టింగ్ మాజీ సీఈవో కాగా, సుబ్రమణియం ఫెడ్ఎక్స్ సీఈవో, ప్రెసిడెంట్-ఎలెక్ట్.