ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వారిని కరాచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ నెల 14న ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని ఎగువ కోహిస్థాన్లోని దాసు ఆనకట్ట స్థలానికి చైనా ఇంజనీర్లతో వెళ్తున్న బస్సుపై ఐఈడీ దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది చైనా పౌరులతో సహా 13 మంది మరణించారు.
ఇది జరిగిన రెండు వారాలకు పాకిస్థాన్లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం కాల్పులు జరుపడం కలకలం రేపింది. కాగా, తమ దేశీయులపై కాల్పుల ఘటనను ప్రత్యేకంగా చూడాల్సిన కేసు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు. పాకిస్థాన్లోని చైనా ప్రజలు, ఆస్తులకు ఆ దేశం రక్షణ కల్పిస్తుందన్న పూర్తి నమ్మకం తమకు ఉన్నదని ఆయన అన్నారు.