న్యూయార్క్, మే 19: ఒప్పందాన్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ తమ డాటాను వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆ కంపెనీకి లేఖ రాసింది. ట్విట్టర్ అధిపతి ఎలాన్మస్క్ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్ స్పైరో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ట్విట్టర్ తరఫున లేఖ రాశారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి తమ డాటాను వినియోగిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు.
జూన్ 7 నాటికి లేఖపై స్పందించాలన్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి స్పందించారు. ‘ట్విట్టర్ నుంచి లేఖ అందింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత స్పందిస్తాం. ట్విట్టర్తో సఖ్యతతో ఉంటూనే మా అనుబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నాం’ అని అన్నారు.