శాన్ఫ్రాన్సిస్కో: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకుంటే 75శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలపై మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులు మండిపడ్డారు. భారీ తొలగింపులు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎలాన్ మస్క్కు మంగళవారం వారు బహిరంగ లేఖ రాశారు. భారీగా ఉద్యోగాలను తొలగించాలనే మస్క్ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు.
75 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ట్విట్టర్ వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. ట్విట్టర్లో హానికర కంటెంట్ను నియంత్రించే సామర్థ్యం, భద్రతా సమస్యలను ఎదుర్కోవడంలాంటి వాటిపై ప్రభావం పడుతుందన్నారు. నిరంతరం వేధింపులు, బెదిరింపుల మధ్య తాము పనిచేయలేమని పేర్కొన్నారు. కార్మికులందరికీ న్యాయమైన పని విభజన విధానాలుండాలని డిమాండ్ చేశారు. రిమోట్ వర్క్తోసహా ఇప్పుడున్న ఉద్యోగుల ప్రయోజనాలను అలాగే ఉంచాలని మస్క్కు విన్నవించారు.