ఇస్తాబుల్: తుర్కియేలో (Turkey) భూకంపం సృష్టించిన విలయంలో మృతిచెందినవారి సంఖ్య 45 వేలు దాటింది. గత నెల 6న తుర్కియేతోపాటు దాని పక్కనే ఉన్న సిరియాలో పది నిమిషాల వ్యవధిలోనే 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవించిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపం ధాటికి భారీ భవంతులు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో జనం మంచి నిద్రలో ఉన్న సమయంలో భూకంపాలు చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అయితే ఇప్పటివరకు దేశంలో 45,968 మంది మరణించారని తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయ్లూ (Interior Minister Suleyman Soylu) వెల్లడించారు. వారిలో సిరియాకు (Syria) చెందిన పౌరులు 4267 మంది ఉన్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో పది నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు వచ్చాయి. సిరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న హటాయ్ ప్రావిన్సు (Hatay Province) కేంద్రంగా రెండుసార్లు భూమి కంపించింది. తొలుత 7.8 తీవ్రతతో, ఆ తర్వాత 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భారీ భూకంపం వల్ల ఇరుదేశాల్లో ఇప్పటివరకు 50 వేలమందికిపైగా మృతిచెందారు. వేల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
Houses continue to collapse after the earthquake in Turkey, the footage shows the moment of collapse in the city of Sanliurfa. https://t.co/X6IJuW33GC pic.twitter.com/87d3grpqM2
— Victor vicktop55 (@vicktop55) February 6, 2023