ఇస్తాంబుల్: తుర్కియే భూకంపం వల్ల ఆ దేశానికి సుమారు 84 బిలియన్ డాలర్ల(రూ.8400 కోట్ల డాలర్లు) నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ఆర్ధిక నష్టం దేశ జీడీపీలో పది శాతం ఉంటుందని భావిస్తున్నారు. టర్కిష్ ఎంటర్ప్రైజెస్ అండ్ బిజినెస్ కాన్ఫిడరేషన్ ఈ నష్టాన్ని అంచనా వేసింది. రెసిడెన్షియల్ బిల్డింగ్లు కూలిపోవడం వల్ల ఆ నష్టం 71 బిలియన్ల డాలర్లు ఉంటుందని, ఇక జాతీయ ఆదాయంలో 11 బిలియన్ల డాలర్ల నష్టం ఉంటుందని ఆ గ్రూపు తెలిపింది.
భారీ భూకంపాల వల్ల తుర్కియేలోని 10 ప్రావిన్సుల్లో నష్టం విపరీతంగా ఉంది. బిల్డింగ్లు, ఇండ్లు, హాస్పిటళ్లూ చాలా వరకు కూలిపోయాయి. రోడ్లు, పైప్లైన్లు, ఇతర మౌళికసదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు 13.5 మిలియన్ల మంది జీవించే ప్రదేశాల్లో ఈ నష్టం జరిగింది.
అత్యంత వేగంగా మౌళికసదుపాయాలు, ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రెసిడెంట్ రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు. దేశ వృద్ధి రేటు అంచనా వేసిన దానికన్నా రెండు శాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.